ఎలగందల్ కోట
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటైన కరీంనగర్ జిల్లా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల్ గ్రామంలో ఈ ఎలగందల్ కోట ఉంది.
కరీంనగర్ జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నది తీరంలో ఉన్న ఈ ఎలగందల్ కోట ఒకప్పుడు కుతుబ్ షాహి వంశం, మొఘల్ సామ్రాజ్యం మరియు హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది. చారిత్రకంగా అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడిన ఈ కోట కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన చారిత్రక ప్రదేశం.
ఎలగందల్ కోట నుంచి మానకొండూరు వరకు కరీంనగర్ -వేములవాడ రహదారిలో 9 కిలోమీటర్ల మేరకు రహస్యమార్గం ఉందని ప్రజలు నమ్ముతున్నారు.
ఈ కోట వెనుక దాగిన చరిత్ర :-
వెలగందుల మరియు బహుధాన్యాపురం కోట అని పిలువబడే ఈ ఎలగందల్ కోటని కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. ఎతైనా కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు మరియు రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ కోట అలరారుతోంది.
యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ దృడంగా చేసిన ఈ ఎలగందల్ కోటని 16 వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశస్థులు ఆక్రమించుకొని క్యూయినమూల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు.తదనంతరం ఈ కోట మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్ళింది.
సికిందర్ ఝా (1803-1823) హయాంలో దంసా 1754 లో పునర్నిర్నాణం చేసిన ఈ కోటకు బహదూర్ ఖాన్ మరియు కరిముద్దిన్ లు ఖిలేదార్లుగా పనిచేసారు.
కరీంనగర్ కి నిజాం పాలనలో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ కోట ఉండేది.
ఈ ఎలగందల్ గ్రామంలో మరో చివర ‘ దో మినార్ ‘ అనే కట్టడం ఉంది. బహమని సుల్తానులు ముస్లింలు వారి పండుగ రోజుల్లో ప్రార్ధన చేసే ఈద్ గా నిర్మించారు. దీనికి లోపల నుంచి మెట్లు ఉన్నాయి.
ఎలగందల్ కోటలో మొత్తం 53 బురుజులు ఉన్నాయి. 1754 సంవత్సరంలో జఫర్ – ఉద్ – దౌలా ఈ కోట యొక్క తూర్పు ద్వారం దగ్గర బృందావన్ ట్యాంక్ ను నిర్మించాడు.
శత్రువులు లోనికి రాకుండా మరియు వారి దాడులని నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు అంటే 16 అడుగుల వెడల్పు మరియు 4 మీటర్లు అంటే 13 అడుగుల లోతైనా కందకాన్ని ఏర్పాటు చేసి అందులో మొసళ్లు వదిలేవారు.
రవాణా సదుపాయాలు :–
రోడ్డు మార్గం :-
కరీంనగర్ నుంచి కమాన్ పూర్ మరియు బావుపేట మీదుగా ప్రైవేట్ బస్సులు మరియు ఆటోలు నడుస్తూనే ఉంటాయి. కరీంనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో గల ఎలగందల్ గ్రామంలో ఈ ఎలగందల్ కోట ఉన్నది.
రైలుమార్గం :-
కరీంనగర్ లో రైల్వే స్టేషన్ సదుపాయం కలదు. అక్కడ నుంచి ప్రైవేట్ టాక్సీ లో అయినా ఎలగందల్ చేరుకోవచ్చు లేదా బస్ స్టాండ్ కి వెళ్లి ఎలగందల్ గ్రామం బస్ ఎక్కి ఎలగందల్ కోటకి వెళ్ళవచ్చు.
వాయుమార్గం :-
ఎలగందల్ కోట హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో కలదు. కావున, పర్యాటకులు శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి క్యాబ్ లలో ఈ కోటకి వెళ్ళవచ్చు.